జై విజ్ఞాన్..జై అనుసంధాన్ : తోమర్
ABN , First Publish Date - 2022-02-05T21:59:33+05:30 IST
జై జవాన్.. జై కిసాన్ మనందరికీ తెలుసని, కానీ జై విజ్ఞాన్..జై అనుసంధాన్
హైదరాబాద్: జై జవాన్.. జై కిసాన్ మనందరికీ తెలుసని, కానీ జై విజ్ఞాన్..జై అనుసంధాన్ నినాదాలను వాటికి ప్రధాని మోదీ చేర్చారని కేంద్ర వ్యవసాయం శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. నూతన సంకల్పంతో ఇక్రిశాట్ ముందుకు సాగాలన్నారు. కొత్త వంగడాల సృష్టితో మరింత ముందుకు సాగాలన్నారు. మరో 25 ఏళ్లలో వ్యవసాయరంగంలో పెనుమార్పులు వస్తాయన్నారు.