శంషాబాద్ విమానాశ్రయ విస్తరణకు సహకరిస్తాం: కేంద్ర మంత్రి సింధియా
ABN , First Publish Date - 2021-09-12T20:08:00+05:30 IST
విధ దేశాల నుంచి హైదరాబాద్కు విమాన ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపద్యంలో హైదరాబాద్(శంషాబాద్) విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని కేంద్ర
హైదరాబాద్: వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు విమాన ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపద్యంలో హైదరాబాద్(శంషాబాద్) విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా హామీ ఇచ్చారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్ధిక, అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న మరో 6 ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రి సింధియా ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎకానమిక్ గ్రోత్ సెంటర్గా అభివృద్ధి చెందడంతో పాటు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ రూపు దిద్దకుంటున్నదని అన్నఆరు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ దేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగు పరచాలని కేంద్ర మంత్రిని కోరారు. బిజినెస్ హబ్గా, ఐటీహబ్గా, హెల్త్హబ్గా , టూరిజం హబ్గా హైదరాబాద్ నగరం , తెలంగాణ రాష్ట్రం ఇంకా వస్తరిస్తుండడంతో దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు పలు అంతర్జాతీయ నగరాల నుంచి ప్రయాణీకులు వస్తున్నందున సౌత్ ఈస్ట్ ఏషియా, యూరప్, యూఎస్లకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లయిట్స్ కనెక్టివిటీని పెంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి సింధియా దృష్టికి తీసుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతిపాదనలో ఉన్న వివిధ పట్టణాల్లోని 6 ఎయిర్పోర్టుల అభివృద్ధి ఆపరేషన్స్ కోసం వెంటనే చర్యలు తీసుకుని కేంద్ర విమానయానమంత్రిత్వ శాఖ నుంచి తగిన సహకారం అందించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్కు మెట్రో కనెక్టివటీ ఏర్పాటు చేఏలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన కేంద్ర మంత్రి సింధియా దేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధికి సంపూర్ణ సమకారం అందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి సింధియా అభిప్రాయం వ్యక్తం చేశారు.