మెదక్ జిల్లాలో కేంద్రమంత్రి Sanjeev kumarకు అవమానం
ABN , First Publish Date - 2022-07-02T16:02:25+05:30 IST
జిల్లాలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్లో కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్ అవమానం జరిగింది.
మెదక్: జిల్లాలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్లో కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్(Sanjeev kumar balyan) అవమానం జరిగింది. శనివారం ఉదయం కేంద్రమంత్రి గెస్ట్హౌజ్కు వచ్చినప్పటీకీ ఆర్అండ్బీ అధికారులు తాళం తీయని పరిస్థితి. దీంతో బీజేపీ శ్రేణులు తాళం పగలకొట్టి కేంద్ర మంత్రిని గెస్ట్ హౌజ్లోకి తీసుకెళ్లారు. అయితే గెస్ట్ హౌజ్లో కనీసం నీళ్లు కూడా అందుబాటులో ఉంచని వైనం ఆశ్చర్యానికి గురిచేసింది. కేంద్రమంత్రి వచ్చినప్పటికీ ప్రోటోకాల్ పాటించని ఆర్అండ్బీ అధికారులపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.