Online క్రీడలపై రాష్ట్రప్రభుత్వాలదే నిర్ణయం

ABN , First Publish Date - 2022-07-09T13:55:06+05:30 IST

ఆన్‌లైన్‌ క్రీడల నిషేధంపై రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌ పేర్కొన్నారు. కారైక్కాల్‌లో శుక్రవారం జాలర్ల

Online క్రీడలపై రాష్ట్రప్రభుత్వాలదే నిర్ణయం

                               - కేంద్రమంత్రి మురుగన్‌


పెరంబూర్‌(చెన్నై), జూలై 8: ఆన్‌లైన్‌ క్రీడల నిషేధంపై రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌ పేర్కొన్నారు. కారైక్కాల్‌లో శుక్రవారం జాలర్ల కుటుంబాలను పరామర్శించిన ఆయన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, జాలర్ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారి సంక్షేమానికి పలు పథకాలను కేంద్రప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. ఆన్‌లైన్‌ క్రీడలను నిషేధించేలా కేంద్రం చర్యలు చేపట్టిందని, కానీ, ఈ వ్యవహారం రాష్ట్రాల పరిధిలో ఉండడంతో ఆయా రాష్ట్రప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి తెలిపారు.

Updated Date - 2022-07-09T13:55:06+05:30 IST