తెలంగాణలో ప్రతి పథకంలోనూ కేంద్రం నిధులే: kishan reddy
ABN , First Publish Date - 2022-04-15T18:18:53+05:30 IST
తెలంగాణ ప్రతీ పథకంలోనూ కేంద్ర నిధులే ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
జోగులాంబ గద్వాల: తెలంగాణ ప్రతీ పథకంలోనూ కేంద్ర నిధులే ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర భాగంగా అలంపూరు మండలం లింగనవాయి గ్రామంలో గ్రామస్థులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మాటమంతి కార్యక్రమంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... పేద ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తే నిజాం దొర కేసీఆర్ తెలంగాణలో అడ్డుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో కుటుంబ, అహంకార పాలన పోవాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.