తెలంగాణ సీఎం KCRకు కేంద్రమంత్రి Kishan reddy లేఖ
ABN , First Publish Date - 2022-06-15T19:42:13+05:30 IST
తెలంగాణ సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు.
న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్(KCR)కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి(Kishan reddy) లేఖ రాశారు. చర్లపల్లి, నాగులపల్లి రైల్వే స్టేషన్ల దగ్గర.. అభివృద్ధి పనులకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. చర్లపల్లి స్టేషన్ వద్ద పార్కింగ్ వసతులు, అప్రోచ్ రోడ్డు కోసం భూమి కేటాయించాలని వినతి చేశారు. నాగులపల్లి స్టేషన్ దగ్గర టెర్మినల్, పార్కింగ్ అభివృద్ధికి 300 ఎకరాలు స్థలం కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో అభ్యర్థించారు.