సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

ABN , First Publish Date - 2022-02-21T19:23:26+05:30 IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు.

సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడ్ల్యూఎస్)10 రిజర్వేషన్లు అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. మూడేళ్ల నుంచి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం లేదని కేంద్రమంత్రి తెలిపారు. దీని వలన తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణతో ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి అన్యాయం జరగడం లేదని తెలిపారు. దేశవ్యాప్తంగా 158 కేంద్ర విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు అదనంగా 2.15 లక్షల సీట్లను ఏర్పాటు చేసేందుకు 4315.15 కోట్లను కేటాయించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-21T19:23:26+05:30 IST