కేసీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా...చర్చకు సిద్ధం..కానీ : Kishan reddy

ABN , First Publish Date - 2022-02-15T18:32:16+05:30 IST

మోదీ ప్రభుత్వం ఏడేళ్లోలో దేశానికి ఏం చేసిందో చెప్పడానికి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

కేసీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా...చర్చకు సిద్ధం..కానీ : Kishan reddy

హైదరాబాద్: మోదీ ప్రభుత్వం ఏడేళ్లోలో దేశానికి ఏం చేసిందో చెప్పడానికి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ముందు అమరుల సాక్షిగా కేసీఆర్‌తో చర్చకు సిద్ధమన్నారు. కేసీఆర్ బహిరంగ సవాల్‌ను కేంద్రం తరపున తాను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అయితే...‘‘బహిరంగ చర్చకు నేను సిద్ధం కానీ ఒక షరతు!- కేసీఆర్ ప్రజలు మాట్లాడే భాష మాట్లాడాలి’’ అని అన్నారు. బీజేపీకి దేశమే ముఖ్యమని... వ్యక్తులు, కుటుంబం కాదన్నారు. కానీ కేసీఆర్‌కు వ్యక్తులు, కుటుంబం మాత్రమే ముఖ్యమని కేంద్రమంత్రి అన్నారు. భారత రాజ్యాంగంను ప్రపంచం అంతా పొగడని దేశం ఉండదన్నారు. ఇండియా అంటే ఇందిరా అనే నినాదాన్ని రాజ్యాంగం ద్వారనే ఓడించారని తెలిపారు. రాజ్యాంగ హక్కు వల్లనే హుజురాబాద్‌లో కేసీఆర్ ఓడిపోయారని అందుకే రాజ్యాంగం మారాలని అంటున్నారని మండిపడ్డారు.


బీజేపీకి నడ్డా తరువాత ఎవరు అధ్యక్షుడు అవుతారో ఎవరూ చెప్పలేరని...కానీ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తరువాత కేటీఆర్ అధ్యక్షుడు అవుతారన్నారు. రాష్ట్ర భవిష్యత్ కేసీఆర్ డైనింగ్ టేబుల్‌పై నిర్ణయాలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో ఏం జరుగుతుందో తెలుసా కేసీఆర్ అని ప్రశ్నించారు. గత ఏడేళ్లుగా మతకలహాలు లేవని... బాంబ్ పేలుళ్లు లేవని, కర్ఫ్యూలు లేవన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో నెలల పాటు రోడ్లన్నీ మూసివేసి ఉండేవని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల శాంతితో ముందుకు వెళ్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-15T18:32:16+05:30 IST