తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-17T14:13:03+05:30 IST

తెలంగాణ ప్రజలకు కేంద్రం తరపున కిషన్‌రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజలకు కేంద్రం తరపున కిషన్‌రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ విమోచన ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది... స్వేచ్ఛా వాయువులు పీల్చిన గొప్ప దినం ఈరోజు అని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. ఎంతో మంది ఉద్యమకారుల ఫలితంగానే తెలంగాణకు విముక్తి లభించందన్నారు. ఇప్పటికీ బానిస మనస్తత్వంతోనే తెలంగాణలో పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఎంఐఎంకు బానిసగిరి చేస్తూ విమోచనదినం జరపడంలేదని విమర్శించారు. మోదీ నాయకత్వంలో భారత్ మరింత అభివృద్ధి చెందుతోందన్నారు. దేశ ప్రజలకు నీతినిజాయితీతో కూడిన పాలన అందిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-09-17T14:13:03+05:30 IST