మోడీకి ఏపీ, తెలంగాణా రెండు కళ్లు‌: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-08-19T23:54:12+05:30 IST

ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివని కేంద్ర టూరిజం

మోడీకి ఏపీ, తెలంగాణా రెండు కళ్లు‌: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీకి  ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివని కేంద్ర టూరిజం శాఖా మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నగరంలోని  ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను  కిషన్ రెడ్డి  దర్శించుకున్నారు. కిషన్‌రెడ్డికి  ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. దుర్గమ్మ ను దర్శించుకొని కిషన్‌రెడ్డి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తెలుగు ప్రజల ఆశీర్వాదం కోసం తాను వచ్చానన్నారు.  దుర్మమ్మ ఆలయాన్ని టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు తన సహకారం అందిస్తానన్నారు. నిన్న తిరుమల వెంకన్న స్వామిని, ఇవాళ దుర్గమ్మను దర్శించుకున్నానన్నారు. దేశ సంస్క్రతి, సాంప్రదాయాలను పరిరక్షించాలని మోడీ అకాంక్షించారన్నారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో గల వీరబద్ర దేవాలయాన్ని యునెస్కొ హెరిటేజ్ సెంటర్ గా గుర్తించిందన్నారు. ఏపీలో 126 పురాతన కేంద్రాలున్నాయి. రానున్న రోజుల్లో వాటిని  రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధలను పిలిచి సీఎస్అర్ ఫండ్ కింద డెవలప్ చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. టూరిజం శాఖ చాలా ఛాలెంజ్‌తో కూడుకుందన్నారు. 



గత రెండేళ్లుగా కోవిడ్‌తో టూరిజం దెబ్బతిందన్నారు. జనవరి 1 నాటికి కోవిడ్ తగ్గగానే టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. భారత్ దర్శన్ ద్వారా చారిత్రాత్మక కట్టడాల విశిష్టతను అందరికీ తెలిపే విధంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. పర్యటక శాఖ ద్వారా తన వంతు సహకారం తెలుగు రాష్ట్రాలకు తెలుగువాడిగా అందిస్తానని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ మర్యాద పూర్వకంగానే తనను ఆహ్వానించారన్నారు. తెలుగువాడికి కేంద్ర‌మంత్రి అవకాశం రావడంతోనే తేనేటి విందుకు ఆహ్వానించారన్నారు. 

Updated Date - 2021-08-19T23:54:12+05:30 IST