తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: Kishan reddy

ABN , First Publish Date - 2022-04-25T18:23:11+05:30 IST

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: Kishan reddy

జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 3 జిల్లాలను వెనుకబడ్డ జిల్లాలుగా కేంద్రం గుర్తించిందని తెలిపారు. భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాలను ఆస్పిరేషన్ జిల్లాలుగా గుర్తించామన్నారు. ఈ జిల్లాల్లో విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. ఆస్పిరేషన్ జిల్లాల్లో అభివృద్ధి పనులను కేంద్రం స్వయంగా పరిశీలిస్తోందన్నారు. ప్రపంచంలో కరోనా వారియర్స్‌ను గుర్తించిన ప్రభుత్వం బీజేపీ అని చెప్పుకొచ్చారు. త్వరలో 5-15 ఏళ్ల పిల్లలకు వాక్సిన్ అందిస్తామని వెల్లడించారు. కరోనా మళ్లీ విజృంభిస్తోందని, అందరూ విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా నాలుగవ దశ ప్రభావం లేకుండా కలిసికట్టుగా పోరాడుదామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-04-25T18:23:11+05:30 IST