Union Minister: సిద్ధవైద్య అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2022-08-14T13:36:44+05:30 IST
స్థానిక తాంబరం శానిటోరియం ప్రాంతంలోని సిద్ధవైద్య పరిశోధనా సంస్థలో కొత్త పరిశోధన కేంద్రం భవనాన్ని, ఔట్పేషెంట్ విభాగాన్ని కేంద్ర ఆయుష్,
- కేంద్ర మంత్రి సర్బానంద సోరోవాల్
- తాంబరంలో నూతన పరిశోధన కేంద్రం భవనం ప్రారంభం
చెన్నై, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక తాంబరం శానిటోరియం ప్రాంతంలోని సిద్ధవైద్య పరిశోధనా సంస్థలో కొత్త పరిశోధన కేంద్రం భవనాన్ని, ఔట్పేషెంట్ విభాగాన్ని కేంద్ర ఆయుష్, ఒడరేవులు, జలమార్గాల శాఖల మంత్రి సర్బానంద సోరోవాల్(Minister Sarbananda Sorowal) శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... సిద్ధవైద్యం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కొత్త భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ నూతన ప్రధాన కార్యాలయ భవనం అధికారులు, ఉద్యోగుల అవసరాలను తీరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం(State Medical Minister M. Subramaniam), తాంబరం కార్పొరేషన్ మేయర్ కె. వసంతకుమారి, శాసనసభ్యుడు ఎస్ఆర్రాజా, సిద్ద మెడిసిన్ రిసెర్చి సెంటర్ గ్రూప్ డైరెక్టర్ జనరల్ కె.కనకవల్లి, డైరెక్టర్ ఆర్.మీనాకుమారి తదితరులు పాల్గొన్నారు.