Union Minister: సిద్ధవైద్య అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-08-14T13:36:44+05:30 IST

స్థానిక తాంబరం శానిటోరియం ప్రాంతంలోని సిద్ధవైద్య పరిశోధనా సంస్థలో కొత్త పరిశోధన కేంద్రం భవనాన్ని, ఔట్‌పేషెంట్‌ విభాగాన్ని కేంద్ర ఆయుష్‌,

Union Minister: సిద్ధవైద్య అభివృద్ధికి కృషి

- కేంద్ర మంత్రి సర్బానంద సోరోవాల్‌

- తాంబరంలో నూతన పరిశోధన కేంద్రం భవనం ప్రారంభం


చెన్నై, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక తాంబరం శానిటోరియం ప్రాంతంలోని సిద్ధవైద్య పరిశోధనా సంస్థలో కొత్త పరిశోధన కేంద్రం భవనాన్ని, ఔట్‌పేషెంట్‌ విభాగాన్ని కేంద్ర ఆయుష్‌, ఒడరేవులు, జలమార్గాల శాఖల మంత్రి సర్బానంద సోరోవాల్‌(Minister Sarbananda Sorowal) శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... సిద్ధవైద్యం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కొత్త భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ నూతన ప్రధాన కార్యాలయ భవనం అధికారులు, ఉద్యోగుల అవసరాలను తీరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం(State Medical Minister M. Subramaniam), తాంబరం కార్పొరేషన్‌ మేయర్‌ కె. వసంతకుమారి, శాసనసభ్యుడు ఎస్‌ఆర్‌రాజా, సిద్ద మెడిసిన్‌ రిసెర్చి సెంటర్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.కనకవల్లి, డైరెక్టర్‌ ఆర్‌.మీనాకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T13:36:44+05:30 IST