రచయిత రంగనాథ్ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ABN , First Publish Date - 2021-09-19T01:07:17+05:30 IST
తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ రచయిత రంగనాథ్ రామచంద్రరావుకు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ రచయిత రంగనాథ్ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కన్నడ నవల "ఓం నమోః "ను తెలుగులోకి రంగనాథ్ రామచంద్రరావు అనువదించారు. ఓం నమోః నవలను కన్నడంలో శాంతినాథ్ దేసాయి రాసారు. రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాకు చెందినవారు.
రామచంద్రరావు "సిగ్నల్" కథా సంపుటిని అను సృజన చేసారు. దీనిలో భూమి పైన ఉండే మనుష్యలు స్వభావాల్లో, ఆలోచనల్లో ఒక్కలాంటి వాళ్ళేనని వివరించారు. ప్రపంచంలో ఉన్న మంచితనం, కరుణ, ప్రేమ, దుర్మార్గం, మోసం, వంచన ఏ మాత్రం రూపం మార్చుకోకుండా అందరిలో ఒకలాగే ఉన్నాయని చెబుతోంది.