అమిత్‌ షా తిరుపతి పర్యటన రద్దు

ABN , First Publish Date - 2021-03-01T16:52:11+05:30 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన రద్దు అయ్యింది. ఈనెలలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సుకు అమిత్ షా హాజరుకావాల్సి ఉండగా అకస్మాత్తుగా పర్యటన రద్దు అయ్యింది.

అమిత్‌ షా తిరుపతి పర్యటన రద్దు

అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన రద్దు అయ్యింది. ఈనెలలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సుకు అమిత్ షా హాజరుకావాల్సి ఉండగా అకస్మాత్తుగా పర్యటన రద్దు అయ్యింది. ఈనెల 4, 5 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించాలని తలపెట్టారు. దానికి సంబంధించి తమినాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాచారం వెళ్లింది. అయితే అకస్మాత్తుగా అమిత్‌షా తిరుపతి పర్యటన రద్దు అయ్యింది. ముఖ్యమంత్రుల సమావేశం రద్దు అయినట్లు కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన వెల్లడైంది. అమిత్‌ షా పర్యటన రద్దుపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Updated Date - 2021-03-01T16:52:11+05:30 IST