పాండోరా పేపర్స్పై కేంద్రం సీరియస్
ABN , First Publish Date - 2021-10-05T02:15:52+05:30 IST
2016వ సంవత్సరంలో ప్రకంపనలు సృష్టించిన ‘పనామా పేపర్స్’ మాదిరిగానే తాజాగా ‘పండోరా పేపర్స్’ పేరుతో సంపన్నులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల ఆస్తులు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన రహస్య పత్రాలను ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) బహిర్గతం చేసింది..
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన పాండోరా పేపర్స్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్యాక్స్ ఎగవేత దారులపై తగిన చర్యలు తీసుకుంటామని సోమవారం ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయమై దర్యాప్తును కఠినంగా నిర్వహిస్తామని, సంబంధిత దర్యాప్తు సంస్థలకు అప్పగించినట్లు ఓ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నల్లధనంపై ఉక్కుపాదం మోపాలన్న తమ లక్ష్యంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని, పాండోరా పేపర్స్ దర్యాప్తులో అవసరమైతే విదేశీ దర్యాప్తు సంస్థల సాయం కూడా తీసుకుంటామంటామని మోదీ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
2016వ సంవత్సరంలో ప్రకంపనలు సృష్టించిన ‘పనామా పేపర్స్’ మాదిరిగానే తాజాగా ‘పండోరా పేపర్స్’ పేరుతో సంపన్నులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల ఆస్తులు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన రహస్య పత్రాలను ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) బహిర్గతం చేసింది. ఈ జాబితాలో 380 మంది భారతీయులతో పాటు 90 దేశాలకు చెందిన సంపన్నులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు ఉన్నారు.