MP TG వెంకటేష్‌ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇదీ..

ABN , First Publish Date - 2021-11-29T19:00:19+05:30 IST

పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ రాజ్యసభలో

MP TG వెంకటేష్‌ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇదీ..

న్యూ ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ రాజ్యసభలో ధర్మల్ విద్యుత్ కేంద్రాల గురించి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున సంబంధిత మంత్రి ప్రహ్లాద్‌ జోషి సమాధానం ఇచ్చారు. గత అక్టోబర్‌ నాటికి ఏపీలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు కోల్‌ ఇండియా 13.24 మెట్రిక్‌ టన్నుల బొగ్గు సరఫరా చేసింది. గతేడాది ఇదే కాలంలో కేవలం 7.18 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేసింది. విద్యుత్‌ కేంద్రాల అవసరాల కోసం మరో 4.97 లక్షల టన్నుల బొగ్గును.. సరఫరా చేసేందుకు సిద్ధమని ఏపీకి కోల్‌ ఇండియా ప్రతిపాదన చేసింది. విద్యుత్‌ వినియోగం పెరగడంతో.. దేశ వ్యాప్తంగా బొగ్గుకు డిమాండ్‌ పెరిగింది అని రాజ్యసభ వేదికగా ప్రహ్లాద్‌ జోషి వివరించారు.

Updated Date - 2021-11-29T19:00:19+05:30 IST