పేదలకు కేంద్రం ఆపన్న హస్తం: విష్ణువర్ధన్రెడ్డి
ABN , First Publish Date - 2020-03-27T08:28:42+05:30 IST
కరోనా కారణంగా విధించిన 21 రోజుల లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించిందని...
న్యూఢిల్లీ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా విధించిన 21 రోజుల లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పేదలు, మహిళలు, ఉద్యోగులను ఆదుకునేందుకు రూ.1.70 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినందుకు గురువారం ఒక ప్రకటనలో ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.