కేంద్రం నిర్ణయంతో క్రీడాకారులకు పండగ

ABN , First Publish Date - 2020-08-30T02:52:49+05:30 IST

క్రీడా అవార్డు గ్రహీతలకు ఇచ్చే బహుమతిని పెంచుతున్నట్లు క్రీడా మంత్రి కిరెన్ రిజిజు ప్రకటించారు.ఇటీవల పలువురు క్రీడాకారులకు...

కేంద్రం నిర్ణయంతో క్రీడాకారులకు పండగ

న్యూఢిల్లీ: క్రీడా అవార్డు గ్రహీతలకు ఇచ్చే బహుమతిని పెంచుతున్నట్లు క్రీడా మంత్రి కిరెన్ రిజిజు ప్రకటించారు.ఇటీవల పలువురు క్రీడాకారులకు ఖేల్ రత్న, అర్జున తదితర అవార్డులు అందజేసిన విషయం తెలిసిందే. వారికి బహుమతిగా కొంత నగదును ఇస్తున్నారు. అయితే అది చాలా తక్కువని, దానిని పెంచబోతున్నామని క్రీడా మంత్రి కిరెన్ అన్నారు. వీరి ప్రకటన ప్రకారం ఖేల్ రత్నకు ఇప్పటివరకు రూ.7.5 లక్షలు ఇస్తుండగా ఇక నుంచి రూ.25 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నారు.


అలాగే అర్జున అవార్డుకు ఇచ్చే రూ.5 లక్షలను రూ.15 లక్షలకు, ద్యాన్ చంద్‌ అవార్డుకు ఇచ్చే రూ.5 లక్షలను రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల ఇచ్చిన అవార్డులలో అర్జున అవార్డును 27 మంది పొందగా ద్యాన్ చంద్ అవార్డును 15 మంది గెలుచుకున్నారు. అదే విధంగా ద్రోణాచార్య అవార్డును 13 మంది కోచ్‌లు పొందారు.

Updated Date - 2020-08-30T02:52:49+05:30 IST