కేంద్రప్రభుత్వం విభజన హామీలు అమలు చేయలేదు: తులసీరెడ్డి
ABN , First Publish Date - 2022-04-20T23:36:19+05:30 IST
కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా
అమరావతి: కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా, కడప ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం పోర్టు, రాజధాని నిర్మాణానికి నిధులకు సంబంధించిన అంశాలు చట్టంలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఏపీలో ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మల్లా మారాయని విమర్శించారు. బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే పవన్ అని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అయోమయ పార్టీ అని తులసీరెడ్డి ఎద్దేశాచేశారు.