కేంద్ర ప్రభుత్వ పథకాలు మోసపూరితం

ABN , First Publish Date - 2022-07-04T04:02:48+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడు తున్న పథకాలు మోసపూరితమని, ఇష్టారీతిన హామీలిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు అన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు మోసపూరితం
మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు

- ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు  

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై  3: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడు తున్న పథకాలు మోసపూరితమని, ఇష్టారీతిన హామీలిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు అన్నారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో పట్టణ మహాసభ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తూ మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు.  రాబోయే కాలంలో ప్రజలు వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు మిట్టపల్లి పౌలు, చాడ మహేందర్‌రెడ్డి, శంకరయ్య, దేవి పోచన్న, నర్సయ్య, లక్ష్మణ్‌, షఫి, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-04T04:02:48+05:30 IST