నిత్యావసరాల ధరల పెరుగుదలకు కారణం కేంద్ర ప్రభుత్వమే : బుగ్గన

ABN , First Publish Date - 2022-07-08T23:24:04+05:30 IST

గుంటూరు: ఏపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి వైసీపీ ప్లీనరీలో మాట్లాడారు. కరోనాకు తెగించి రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్లి డబ్బులు తెచ్చామని చెప్పారు.

నిత్యావసరాల ధరల పెరుగుదలకు కారణం కేంద్ర ప్రభుత్వమే : బుగ్గన

గుంటూరు: ఏపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి వైసీపీ ప్లీనరీలో మాట్లాడారు. కరోనాకు తెగించి రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్లి డబ్బులు తెచ్చామని చెప్పారు. అమ్మఒడి, వసతిదీవెన, నాడు-నేడు వద్దని ప్రతిపక్షాలు చెప్పగలవా? అని ప్రశ్నించారు. పెట్రో ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయని, నిత్యావసరాల ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని పేర్కొన్నారు. ఏపీలో మద్యం ధరలు ఎక్కువేనని అంగీకరించారు. రాజధానికి గత ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.2 వేల కోట్లేనని చెప్పారు. ఉపాధి పనులకు నిధులు చెల్లిస్తున్నామని చెప్పిన బుగ్గన కోవిడ్ సమయంలో పంచాయతీ నిధులతో కరెంట్ బిల్లులు కట్టామని తెలిపారు. ఏపీని శ్రీలంకతో పోల్చడం అసమంజసమన్నారు. 

Updated Date - 2022-07-08T23:24:04+05:30 IST