ఏపీలో ఎక్కువ రెవెన్యూ లోటు: మంత్రి నిర్మలా

ABN , First Publish Date - 2021-12-14T23:35:17+05:30 IST

ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థికమంత్రి

ఏపీలో ఎక్కువ రెవెన్యూ లోటు: మంత్రి నిర్మలా

ఢిల్లీ: ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. 2019-20లో ఊహించిన దానికంటే ఏపీలో ఎక్కువ రెవెన్యూ లోటు ఉందని ఆమె తెలిపారు. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు నిర్మల సమాధానం ఇచ్చారు. 'అమ్మ ఒడి' - 'వైఎస్‌ఆర్ 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా' పథకాల కారణంగా రెవెన్యూ లోటు అధికంగా ఉందన్నారు. ఉచిత పథకాల వల్ల రెవెన్యూ లోటు అధికంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిన కారణంగా రెవెన్యూ లోటు పెరిగిందని కాగ్‌ పేర్కొందని నిర్మలా తెలిపారు. 

Updated Date - 2021-12-14T23:35:17+05:30 IST