కేంద్ర కేబినేట్ కార్యదర్శి డా.రాజీవ్ గౌబా వీడియో కాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2021-02-27T20:54:56+05:30 IST

కేంద్ర కేబినేట్ కార్యదర్శి డా.రాజీవ్ గౌబా, రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కేంద్ర కేబినేట్ కార్యదర్శి డా.రాజీవ్ గౌబా వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: కేంద్ర కేబినేట్ కార్యదర్శి డా.రాజీవ్ గౌబా, రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ కేసులు వేగంగా పెరగకుండా నియంత్రణ కోసం కంటైన్మెంట్,  సర్వీలెన్ప్ పెద్ద స్ధాయిలో వ్యాక్సినేషన్ తదితర చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ కరోనా రాష్ట్రంలో పూర్తి స్ధాయిలో అదుపులో ఉందని కేంద్రక్యాబినేట్ సెక్రటరీకి తెలిపారు. రాష్ట్రంలో పాజిటీవ్ రేటు 0.43శాతం ఉందని ప్రతి రోజు 200 లోపు కేసులు నమోదు అవుతున్నాయని, ఇది చాలా తక్కువ అని అన్నారు.


రాష్ట్రంలో 1100 లోకేషన్లలో ర్యాపిడ్ ఆంటిజెన్ పరీక్షలు నిర్వహించడం వలన రాష్ట్రంలో కేసుల సంఖ్యను, కరోనాని నియంత్రించడం సాధ్యమైందని, ఎవరికైన పాజిటీవ్ వస్తే వెంటనే మెడిసిన్ కిట్స్ ను అందిస్తున్నామన్నారు.వ్యాక్సినేషన్ డ్రైవ్ కు సంబంధించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 75 శాతం మంది హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వ్యాక్సినేషన్ ఇచ్చామని, వచ్చేనెల 1 తేది న ప్రారంభమయ్యే మూడవ విడత వ్యాక్సినేషన్ సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ సమావేశంలో వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి  ఎస్.ఏ.ఎం రిజ్వీ, ప్రజా ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస్ రావు, వైద్య విద్య సంచాలకులు  రమేశ్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T20:54:56+05:30 IST