ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలి

ABN , First Publish Date - 2022-08-12T04:52:40+05:30 IST

ఉద్యోగాల క ల్పనలో విఫలమైన కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిన రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని, ఆయా పార్టీలు పతనమైనప్పుడే యువకు లందరూ బాగుపడతారని మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.

ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలి
మాట్లాడుతున్న మాజీ మంత్రి చిన్నారెడ్డి

- మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి 

- పెద్దమందడికి చేరుకున్న పాదయాత్ర


పెద్దమందడి, ఆగస్టు 11: ఉద్యోగాల క ల్పనలో విఫలమైన కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిన రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని, ఆయా పార్టీలు పతనమైనప్పుడే యువకు లందరూ బాగుపడతారని మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సంద ర్భంగా వనపర్తి నియోజకవర్గంలో చిన్నారెడ్డి చేపట్టిన పాదయాత్ర మూడవరోజు పెద్దమందడికి చేరుకుంది. సంఘీభావంగా మాజీ ఎంపీ మల్లురవి పాల్గొని కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజలు, నాయకులు డప్పులతో ఘనస్వాగతం పలికిన అనంతరం మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ ఈసారి దేశంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని, బీజేపీ టీఆర్‌ఎస్‌ ప్రభు త్వాలను రేపు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, శ్రీరంగాపురం జడ్పీటీసీ సభ్యుడు రా జేంద్రప్రసాద్‌యాదవ్‌, ఓబీసీ జిల్లా చైర్మన్‌ కోట్ల రవి, ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, వనపర్తి పట్టణ అధ్యక్షుడు డి.కిరణ్‌కుమార్‌, మునిసిపల్‌ కౌన్సిలర్‌ ఫ్లోర్‌లీడర్‌ రాఽధాకృష్ణ, మాజీ కౌన్సిలర్‌ చీర్లచందర్‌, అసెంబ్లీ సోషల్‌ మీడియా కోఆరి ్డనేటర్‌ డి.వెంకటేష్‌, వెంకటయ్యయాదవ్‌, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి గట్టుమన్యం, వాకిటి శ్రీనివా సులు, పెంటన్నయాదవ్‌, రమేష్‌, సుదర్శన్‌రెడ్డి, రవి, జగదీశ్వర్‌రెడ్డి, వర్మ తదితరులున్నారు.

Updated Date - 2022-08-12T04:52:40+05:30 IST