పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేస్తుంది!

ABN , First Publish Date - 2021-04-13T05:26:29+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుతోపాటు సాగరమాలను కూడా కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.

పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేస్తుంది!
మాట్లాడుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

 బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా  

నాయుడుపేట టౌన్‌, ఏప్రిల్‌ 12 : ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుతోపాటు సాగరమాలను కూడా కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఆదివారం నాయుడుపేట ఏఎల్‌సీఎం క్రీడా ప్రాంగణంలో బీజేపీ,  జనసేన పార్టీలు ఏర్పాటు చేసిన మహాసభలో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం శ్రీకాళహస్తి-నడికుడి రైల్వేలైన్‌కు రూ. 2,450 కోట్లను వెచ్చిస్తోందన్నారు.  కేంద్ర ప్రభుత్వం రాజధాని ఏర్పాటుకు రూ. 2,500 కోట్లు ఉచితంగా, మరో రూ. 400 కోట్లు అప్పుగా ఇచ్చినా ఇప్పటికి రాజధాని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ప్రధానమంత్రి  రూ. 3లక్షల కోట్లతో  ఏపీలో జాతీయ రహదారులు ఏర్పాటు చేశారన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఐఏఎస్‌ మాజీ అధికారిగా విశేష అనుభవం ఉన్న తిరుపతి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తద్వారా రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వాకాటి నారాయణరెడ్డి, సురేంద్రరెడ్డి, దయాకర్‌రెడ్డి, రంగినేని కృష్ణయ్య, మాల్యాద్రినాయుడు ఉన్నారు.

Updated Date - 2021-04-13T05:26:29+05:30 IST