రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది నిరంజన్రెడ్డి
ABN , First Publish Date - 2022-03-06T16:40:29+05:30 IST
కేంద్రంపై సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు దండెత్తారు. కేంద్ర నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పుబడుతున్నారు.
వనపర్తి: కేంద్రంపై సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు దండెత్తారు. కేంద్ర నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పుబడుతున్నారు. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. బహిరంగ సభ, పత్రికా సమావేశం ఇలా ప్రతి వేదికను కేంద్రాన్ని విమర్శించేందుకు తెలంగాణ మంత్రులు వాడుకుంటున్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెడుతోందన్నారు. కేంద్రం పోకడలు ప్రజలకు మేలుచేయవని చెప్పారు. త్వరలోనే బీజేపీ నేతలకు ప్రజలు బుద్ధి చెబుతారని నిరంజన్రెడ్డి హెచ్చరించారు.