కేంద్రం తడిగుడ్డతో గిరిజనుల గొంతుకొస్తుంది: హరీష్ రావు

ABN , First Publish Date - 2022-03-23T02:06:05+05:30 IST

కేంద్రం తడిగుడ్డతో గిరిజనుల గొంతుకొస్తుందని మంత్రి

కేంద్రం తడిగుడ్డతో గిరిజనుల గొంతుకొస్తుంది: హరీష్ రావు

హైదరాబాద్: కేంద్రం తడిగుడ్డతో గిరిజనుల గొంతుకొస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇది రెండు పార్టీల వ్యవహారం కాదు, రెండు ప్రభుత్వాల మధ్య వ్యవహారమన్నారు. పార్లమెంట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనులకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఆ మంత్రిపై రేపు మా ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారని ఆయన పేర్కొన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన తండాలు, అన్ని యూనివర్సిటీల్లో నిరసనలకు పిలుపునిస్తున్నామన్నారు. గిరిజన  బిల్లు ఆమోదించే దాకా బీజేపీ వెంటపడుతామని, వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. అబద్దాల బీజేపీ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి బిల్లు ఆమోదం అయ్యేలా చూడాలని ఆయన అన్నారు. 

Updated Date - 2022-03-23T02:06:05+05:30 IST