రజాకార్ల వారసులుగా ఎంఐఎం నేతలు: కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-09-17T23:52:58+05:30 IST

రాష్ట్రంలో రజాకార్ల వారసులుగా ఎంఐఎం నేతలు ఉన్నారని కేంద్ర మంత్రి

రజాకార్ల వారసులుగా ఎంఐఎం నేతలు:  కిషన్ రెడ్డి

నిర్మల్: రాష్ట్రంలో రజాకార్ల వారసులుగా ఎంఐఎం నేతలు ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిర్మల్‌లో బీజేపీ ఆధ్యర్యంలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఖాసీం రజ్వీ స్థాపించిన పార్టీనే మజ్లీస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. అదే మజ్లీస్ విమోచన దినం జరపకుండా అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. ఇక్కడ అక్బరుద్దీన్ నిర్మల్‌లో హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. అక్బరుద్దీన్ అపవిత్రం చేసిన నిర్మల్‌ను ఇవాళ బీజేపీ పవిత్రం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కుటుంబ అవినీతి, నియంత పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు.


హుజురాబాద్‌లో ఈటెలను ఓడించేందుకు టీఆర్‌ఎస్ అనేక కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. కోట్ల రూపాయల ఖర్చు పెట్టి గెలవాలని అనుకుంటోందన్నారు. హుజురాబాద్‌లో ఈటెలను గెలిపించుకుంటామన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సంతకం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సంతకం చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. 

Updated Date - 2021-09-17T23:52:58+05:30 IST