Cellphone కొనివ్వలేదని ఈ విద్యార్థి చేసిన పనేంటో తెలిస్తే...

ABN , First Publish Date - 2022-04-14T14:38:52+05:30 IST

తండ్రి సెల్‌ఫోన్‌ ఇవ్వకపోవడంతో ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కోయంబత్తూర్‌ జిల్లా పొల్లాచ్చి సమీపం కినత్తుకడవు

Cellphone కొనివ్వలేదని ఈ విద్యార్థి చేసిన పనేంటో తెలిస్తే...

పెరంబూర్‌(చెన్నై): తండ్రి సెల్‌ఫోన్‌ ఇవ్వకపోవడంతో ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కోయంబత్తూర్‌ జిల్లా పొల్లాచ్చి సమీపం కినత్తుకడవు కన్నప్పన్‌ నగర్‌కు చెందిన పళనిస్వామి- కిట్టన్‌అమ్మాళ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. చిన్నకుమారుడు అర్జునన్‌ ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికిచ్చిన అర్జునన్‌ ఆన్‌లైన్‌ లో గేమ్‌ ఆడుకొనేందుకు సెల్‌ఫోన్‌ ఇవ్వాలని తండ్రిని కోరగా ఆయన నిరాకరించాడు. దీంతో ఏడుస్తూ తన గదిలోకి వెళ్లిన అర్జునన్‌ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతసేపటికి అర్జునన్‌ గది నుంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు అక్కడకు వెళ్లి చూసి అర్జునన్‌ చూసి బోరున పిలపించారు. ఈ ఘటనపై కినత్తుకడవు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-04-14T14:38:52+05:30 IST