లగుడు సింహాద్రికి ప్రముఖుల నివాళి
ABN , First Publish Date - 2021-03-02T05:32:04+05:30 IST
రాజకీయ కురవృద్ధుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లగుడు సింహాద్రి పార్థివదేహాన్ని సోమవారం పలువురు టీడీపీ ప్రముఖులు సందర్శించారు.
శృంగవరపుకోట రూరల్ (జామి) మార్చి 1: రాజకీయ కురవృద్ధుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లగుడు సింహాద్రి పార్థివదేహాన్ని సోమవారం పలువురు టీడీపీ ప్రముఖులు సందర్శించారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రు డు, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.బి.ఎ రాంప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు కోళ్ల లలిత కుమారి, కేఏ నాయుడు, శోభా హైమావతి దేవి, ఎస్.కోట మండల పార్టీ అధ్యక్షుడు జీ.ఎస్.నాయుడు, మాజీ అధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్, కోళ్ల వెంకటరమణ, గోరపల్లి రాములు నివాళులు అర్పించారు. కొప్పల వెలమ జిల్లా అధ్యక్షుడు కొరుపోలు సత్యారావు, వేపా డ మాజీ ఎంపీపీ వేచలపు వెంకట చినరామునాయుడు, లోక్ సత్తా నాయకుడు భీశెట్టి బాబ్జీ తదితరులు సింహాద్రి మృత దేహం వద్ద ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.