కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపాలి

ABN , First Publish Date - 2020-10-12T06:05:58+05:30 IST

అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించాలని వ్యవసాయ

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపాలి

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి


పెబ్బేరు, అక్టోబరు 11 : అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులు సూచించారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానుండగా, ఆదివారం వనపర్తి పెబ్బేరులోని ప్రభుత్వ అతిథి గృహంలో దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ప్రేమ్‌కుమార్‌, అర్చకుడు ఆనంద్‌శర్మ, జూనియర్‌ అసిస్టెంట్‌ నిరంజన్‌ మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవాలకు కుటుంబ సమేతంగా హాజరుకావాలని ఆహ్వానించారు. అనంతరం మంత్రి ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికను, కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-12T06:05:58+05:30 IST