టీఆర్ఎస్ నాయకుల సంబరాలు
ABN , First Publish Date - 2022-10-07T04:44:34+05:30 IST
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుతూ సీఎం కేసీఆర్చేసిన తీర్మాణాన్ని స్వాగతిస్తూ గురువారం మండలంలో టీఆర్ ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. నాయకులు సకారాం, బషరత్ఖాన్, రాజేష్, షౌకత్ అలీ, శంకర్ పాల్గొన్నారు.
బెజ్జూరు, అక్టోబరు 6: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుతూ సీఎం కేసీఆర్చేసిన తీర్మాణాన్ని స్వాగతిస్తూ గురువారం మండలంలో టీఆర్ ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. నాయకులు సకారాం, బషరత్ఖాన్, రాజేష్, షౌకత్ అలీ, శంకర్ పాల్గొన్నారు.
సిర్పూర్(యు): మండలకేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు బాణసంచాలు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్రావు సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలన్నారు. ఎంపీపీ తొడసం భాగ్యలక్ష్మీ, వైస్ఎంపీపీ ఆత్రంప్రకాష్, సర్పంచులుపెందోర్ నాగోరావు, మెస్రంభూపతి, ఆర్కహిరాబాయి పాల్గొన్నారు.
కౌటాల/జైనూరు: కౌటాల, జైనూరు మండలాల్లో టీఆర్ఎస్ నాయకులు బాణా సంచాకాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఎంపీపీ విశ్వనాథ్, డీసీఎం ఎస్ ఉపాధ్యక్షుడు మాంతయ్య, జైనూరుమండలంలో ఎంపీపీతిరుమల, భాగ్య లక్ష్మి, వైస్ఎంపీపీ లక్ష్మణ్,ప్రకాష్, ఇంతియాజ్లాల, ధర్మారావు పాల్గొన్నారు.