ముర్రుపాలు బిడ్డకు మేలు

ABN , First Publish Date - 2020-08-03T10:49:26+05:30 IST

ముర్రుపాలు బిడ్డకు ఎంతో మేలని సీడీపీవో ఈస్టర్‌రాణి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎస్టీ కాలనీలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తల్లులు..

ముర్రుపాలు బిడ్డకు మేలు

ఉదయగిరి రూరల్‌, ఆగస్టు 2: ముర్రుపాలు బిడ్డకు ఎంతో మేలని సీడీపీవో ఈస్టర్‌రాణి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎస్టీ కాలనీలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తల్లులు, గర్భిణులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలు తాపిస్తే వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుందన్నారు. గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ కృష్ణవేణి, కార్యకర్త పోలమ్మ, గర్భిణులు,బాలింతలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-03T10:49:26+05:30 IST