టీడీపీ ఆఫీస్పై వైసీపీ గూండాల దాడి; ABN ఆంధ్రజ్యోతికి సీసీటీవీ దృశ్యాలు
ABN , First Publish Date - 2022-01-21T23:08:47+05:30 IST
టీడీపీ ఆఫీస్పై వైసీపీ గూండాల దాడి; ABN ఆంధ్రజ్యోతికి సీసీటీవీ దృశ్యాలు
కృష్ణా: గుడివాడ టీడీపీ ఆఫీస్పై వైసీపీ గూండాలే దాడి చేసినట్లు స్పష్టమవుతోంది. వైసీపీ నేతల దాడి దృశ్యాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చిక్కాయి. టీడీపీ కార్యాలయంపై దాడికి వైసీపీ నేత శశిభూషణ్ స్కెచ్ వేశారు. కేసినోలో గుడివాడ మండల వైసీపీ అధ్యక్షుడు జాన్ విక్టర్ చిందులేశారు. కొడాలి నాని ముఖ్య అనుచరుడు శశిభూషణ్ నేతృత్వంలోనే దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. టీడీపీ ఆఫీస్, బోండా ఉమ కారుపై జాన్ విక్టర్ దాడి చేశాడని, శశిభూషణ్ ప్రణాళికతోనే టీడీపీ ఆఫీస్పై జాన్ విక్టర్, సర్దార్ బైగ్ దాడి చేశారు. వైసీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలికారు. టీడీపీ ఆఫీస్ షటర్ మూసివేయకపోతే అరెస్ట్లు చేస్తామని పోలీసులు బెదిరింపులకు దిగారు.