ఫేక్ సర్టిఫికెట్ల ముఠాను అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు
ABN , First Publish Date - 2022-05-18T19:33:37+05:30 IST
ఫేక్ సర్టిఫికెట్ల ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ కేంద్రంగా దందా నడుస్తోంది.
హైదరాబాద్ : ఫేక్ సర్టిఫికెట్ల ముఠాను సీసీఎస్ పోలీసులు(CCS Police) అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్(Madhyapradesh) కేంద్రంగా దందా నడుస్తోంది. సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీ(Sarvepalli Radhakrishna University) పేరుతో నకిలీ సర్టిఫికెట్లు అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గతంలో రెండు ముఠాలను అరెస్ట్ చేసి సీసీఎస్ పోలీసులు జైలుకి పంపారు. ఈ కేసులో యూనివర్సిటీ యాజమాన్యం, సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.