సీసీఎల్ ప్రొడక్ట్స్ లాభంలో 12 శాతం వృద్ధి
ABN , First Publish Date - 2020-10-21T09:06:31+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సీసీఎల్ ప్రొడక్ట్స్ ఏకీకృత ప్రాతిపదికన..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సీసీఎల్ ప్రొడక్ట్స్ ఏకీకృత ప్రాతిపదికన రూ.47.46 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.42.07 కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగింది. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.299 కోట్ల నుంచి రూ.322.22 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2 (100ు) మధ్యంతర డివిడెండ్ను బోర్డు సిఫారసు చేసింది.