సీసీఐ కర్మాగారంలో మిషన్ల మరమ్మతులు
ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST
సీసీఐ కర్మాగారంలో మిషన్ల మరమ్మతులు
తాండూరు రూరల్, జూలై 1: మండలం పరిధి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్మాగారంలో సిమెంటు ఉత్పత్తి ముడిసరుకు కింక్లర్ తయారీ నిలిచిపోయింది. నాలుగు రోజులుగా యాజమాన్యం కర్మాగారంలోని కిలాన్, సిమెంట్ మిల్ సెక్షన్లో మిషనరీ మరమ్మతులు చేస్తున్నారు. కర్మాగారంలోని భవా కన్స్ట్రరక్షన్స్ అధికారుల బృందం, సీసీఐ మెకానికల్ బృందం మరమ్మతు లు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో రిపేర్ పూర్తయితే కింక్లర్ తయారయ్యే అవకాశం ఉందని కార్మికులు పేర్కొంటున్నారు.