AirIndiaకు గ్రీన్సిగ్నల్... AirAsia India కొనుగోలుకు CCI ఆమోదం
ABN , First Publish Date - 2022-06-14T23:33:12+05:30 IST
ఎయిరిండియా, ఎయిర్ ఏషియా ఇండియా మధ్య విలీనం కోసం CCIను టాటా గ్రూప్ సంప్రదించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ : ఎయిరిండియా, ఎయిర్ ఏషియా ఇండియా మధ్య విలీనం కోసం CCIను టాటా గ్రూప్ సంప్రదించిన విషయం తెలిసిందే. యాంటీ-ట్రస్ట్ రెగ్యులేటర్... కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా(CCI) మంగళవారం టాటా సన్స్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ద్వారా AirAsia ఇండియాలో మొత్తం వాటాను కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. Air India Ltd ద్వారా AirAsia India Private Limitedకు సంబంధించిన మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్ను కొనుగోలు చేయడం ఈ ప్రతిపాదన సారాంశం.
ప్రస్తుతం... TSPL ఎయిర్ ఆసియా ఇండియా యొక్క ఈక్విటీ షేర్ క్యాపిటల్లో 83.67 శాతాన్ని కలిగి ఉంది. ఈ రెండు సంస్థలు భారత దేశీయ ప్రయాణీకుల మార్కెట్లో 15.7 శాతం వాటాతో ఉన్నాయి. ఎయిరిండియా ఎక్స్ప్రెస్... ఎయిరిండియా అనుబంధ సంస్థ దేశీయ మార్కెట్లో ఉండదు సరికదా... భారత్, గల్ఫ్ మార్గాల మధ్య మాత్రమే నిర్వహణలో ఉంటుంది. Tataలు... 2020 డిసెంబరులో AirAsia Indiaలో తమ వాటాను 83.67 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా... మలేషియా ఎయిర్లైన్ గ్రూప్ AirAsia Berhad నుండి మిగిలిన 16 శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశముందని ఏప్రిల్ చివరిలో కథనాలు వెలువడ్డాయి. జనవరిలో ఎయిరిండియా నిర్వహణ నియంత్రణను చేపట్టిన టాటా సన్స్ తన బెల్ట్లోని నాలుగు విమానయాన సంస్థలను ఏకీకృతం చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్, విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియా, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ AISATS విమానయాన సంస్థలు ఒకే గొడుగు కిందకు మారనున్నాయి.