నేడు సీబీఎస్‌ఈ పది ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-07-15T12:45:45+05:30 IST

సీబీఎస్‌ఈ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి.

నేడు సీబీఎస్‌ఈ పది ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ మంగళవారం ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఫలితాల విడుదల సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో పదో తరగతి వార్షిక పరీక్షలు రద్దయినందున ప్రత్యామ్నాయ మూల్యాంకన విధానం మేరకు బోర్డు ఫలితాలను ప్రకటించనుంది.

Updated Date - 2020-07-15T12:45:45+05:30 IST