ఆన్లైన్ విద్యపై విద్యార్థులకు అవగాహన
ABN , First Publish Date - 2020-07-06T08:18:36+05:30 IST
విద్యార్థులు, విద్యావేత్తల కోసం డిజిటల్ భద్రత, ఆగ్మెంటెడ్ రియాలిటీపై పాఠ్యాంశాన్ని రూపొందించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), ఫేస్బుక్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి...
- సీబీఎస్ఈ, ఫేస్బుక్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ, జూలై 5: విద్యార్థులు, విద్యావేత్తల కోసం డిజిటల్ భద్రత, ఆగ్మెంటెడ్ రియాలిటీపై పాఠ్యాంశాన్ని రూపొందించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), ఫేస్బుక్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమా ల కోసం దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులు, టీచర్లకు ట్విటర్లో ఆయన సూచించారు. సీబీఎ్సఈ వెబ్సైట్లో పాఠ్యాంశాలు లభిస్తాయని, విద్యార్థుల్లో వైవిధ్యాన్ని పెంపొందించడం, భవిష్యత్తు కార్యక్రమాలకు వారిని సిద్ధం చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అధికారులు తెలిపారు.