సెప్టెంబరులో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు
ABN , First Publish Date - 2020-08-14T06:49:22+05:30 IST
ఉత్తీర్ణులైన 12వ తరగతి విద్యార్థులు మరింత మెరుగుదలను సాధించేందుకు రాసే ఆప్షనల్ పరీక్షలను సెప్టెంబరులో నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎ్సఈ) తెలిపింది...
న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఉత్తీర్ణులైన 12వ తరగతి విద్యార్థులు మరింత మెరుగుదలను సాధించేందుకు రాసే ఆప్షనల్ పరీక్షలను సెప్టెంబరులో నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎ్సఈ) తెలిపింది. రెగ్యులర్ విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో, ప్రైవేట్ విద్యార్థులు సీబీఎ్సఈ వెబ్సైట్ ద్వారా ఆగస్టు 22లోగా ఆప్షనల్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా, 10, 12వ తరగతుల కంపార్ట్మెంట్ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని సీబీఎ్సఈ అధికారులు తెలిపారు.