నల్లమిల్లికి రక్షణ కల్పించండి

ABN , First Publish Date - 2021-07-31T07:06:23+05:30 IST

అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి రక్షణ కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డీజీపీ గౌతంసవాంగ్‌కు ఆయన ఒక లేఖ రాశా రు.

నల్లమిల్లికి రక్షణ కల్పించండి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

  • డీజీపీకి చంద్రబాబు లేఖ

అమరావతి/అనపర్తి, జులై 30(ఆంధ్రజ్యోతి): అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి రక్షణ కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డీజీపీ గౌతంసవాంగ్‌కు ఆయన ఒక లేఖ రాశా రు. మైనింగ్‌ మాఫియానుంచి రామకృష్ణా రెడ్డికి, ఆయన కుటుంబసభ్యులకు ప్రాణ హాని ఉందని, ఈ దృష్ట్యా ఆయనకు తగి న రక్షణ కల్పించాలని చంద్రబాబు తన లేఖలో కోరారు. ‘రామకృష్ణారెడ్డి ప్రజా జీవితంలో ఎంతో క్రియాశీలంగా పనిచేస్తు న్న నాయకుడు. ఆయన అవినీతికి వ్యతి రేకంగా పోరాడడంతోపాటు తన నియోజ కవర్గంలో మైనింగ్‌ మాఫియా అక్రమాల పై కూడా అడ్డుకుంటున్నారు. ఆ మాఫి యాకు సంబంధించిన వ్యక్తులు ఆయనకు హెచ్చరికలు పంపడంతోపాటు కుటుంబసభ్యులను చంపేస్తామని, ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరి స్తున్నారు. దీనిపై రామకృష్ణారెడ్డి గతంలో అనేకసార్లు పోలీస్‌ యంత్రాంగానికి ఫిర్యాదులు చేసినా ఏ చర్య తీసుకోలేదు. ఇప్పటి కైనా మీరు స్పందించి రామకృష్ణారెడ్డికి, ఆయన కుటుంబసభ్యులకు తగిన రక్ష ణ కల్పించాలి’ అని చంద్రబాబు కోరా రు. గతంలో జిల్లా ఎస్పీకి ఇచ్చిన విన తిపత్రాన్ని తన లేఖకు ఆయన జత పర్చారు. మంగళగిరిలోని టీడీపీ కార్యా లయంలో చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజ మహేంద్రవరం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు, తెలుగు రైతు కార్యదర్శి నల్లమిల్లి సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - 2021-07-31T07:06:23+05:30 IST