వివేకా కేసు వేగవంతం
ABN , First Publish Date - 2021-06-11T21:54:56+05:30 IST
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 5వ రోజు కొనసాగుతోంది. ఈ కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు.
కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 5వ రోజు కొనసాగుతోంది. ఈ కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. వివేకా కేసులో అనుమానమున్న వారిని సీబీఐ ప్రశ్నిస్తోంది. రెండు బృందాలుగా సీబీఐ ఈ కేసుని విచారిస్తోంది. ఓ బృందం కడప సెంట్రల్ జైలు కేంద్రంగా, మరో బృందం పులివెందులలో విచారణ చేపట్టనుంది. వివేకాకు సన్నిహితంగా ఉండే కిరణ్కుమార్, సునీల్ సోదరులను పులివెందులలోని వారి నివాసాలకు వెళ్లి సీబీఐ విచారించనుంది.