పశ్చిమ బెంగాల్ మంత్రికి సీబీఐ సమన్లు

ABN , First Publish Date - 2021-09-09T01:10:56+05:30 IST

పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి కేంద్ర దర్యాప్తు

పశ్చిమ బెంగాల్ మంత్రికి సీబీఐ సమన్లు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సమన్లు జారీ చేసింది. ఐ-కోర్ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో దర్యాప్తు కోసం సెప్టెంబరు 13న హాజరుకావాలని ఆదేశించింది. ఐ-కోర్ నిర్వహించిన కొన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడంతో ఈ చర్య తీసుకుంది. ఆయనకు మార్చిలో కూడా సమన్లు జారీ చేసింది. 


ఐ-కోర్ చిట్ ఫండ్ కంపెనీ తన డిపాజిటర్లను మోసం చేసినట్లు కేసు నమోదైంది. పెట్టుబడి పెట్టినవారికి అనేక రెట్లు లాభాలు ఇస్తామని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. 


ముఖ్యమంత్రి మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ప్రశ్నించిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆయనను దాదాపు 9 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. బొగ్గు అక్రమ రవాణా, మనీలాండరింగ్ కేసులో ఆయనను ప్రశ్నించారు. 


ఈ నేపథ్యంలో మమత బెనర్జీ బుధవారం టీఎంసీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, శాసన సభ ఎన్నికల్లో బెంగాలీలు ఇచ్చిన తీర్పును బీజేపీ అంగీకరించలేకపోతోందని ఆరోపించారు. తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం కేంద్ర సంస్థలను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. 


Updated Date - 2021-09-09T01:10:56+05:30 IST