NGOలకు విదేశీ ఫండింగ్ కేసులో 40 ప్రాంతాల్లో CBI సోదాలు
ABN , First Publish Date - 2022-05-11T03:35:44+05:30 IST
న్యూఢిల్లీ : నిబంధనలకు విరుద్ధంగా ఎన్జీవోలు విదేశీ నిధులు స్వీకరించడంలో సహకరించిన ఐదుగురు హోంమంత్రిత్వశాఖ అధికారులను అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ వెల్లడించింది.
న్యూఢిల్లీ : నిబంధనలకు విరుద్ధంగా ఎన్జీవోలు విదేశీ నిధులు పొందడంలో సహకరించిన ఐదుగురు హోంమంత్రిత్వశాఖ అధికారులను అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ వెల్లడించింది. అరెస్టయిన అధికారులు ఎన్జీవోల నుంచి లంచం తీసుకున్నారని తెలిపింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో విస్తృతస్థాయిలో సోదాలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. విదేశీ ఫండింగ్ క్లియరెన్స్ కోసం లంచాలు తీసుకుంటూ హోంమంత్రిత్వశాఖ అధికారులు, ఎన్జీవోల ప్రతినిధులు, మధ్యవర్తులు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారని వివరించారు. మొత్తం 12 ఎన్జీవోలపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
హోంమినిస్ట్రీ అధికారులు లంచం తీసుకుని ఎఫ్సీఆర్ఏ(ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్)కు విరుద్ధంగా ఎన్జీవోలకు క్లియరెన్స్ ఇచ్చారని తేలిందని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. హవాలా మార్గంలో రూ.2 కోట్ల చట్టవిరుద్ధ లావాదేవీ నిర్వహించినట్టు గుర్తించామని, ఢిల్లీ, రాజస్థాన్, చెన్నై, మైసూర్తోపాటు ఇతర ప్రాంతాల్లో సోమవారం సోదాలు జరిపినట్టు వివరించారు.