ఎర్రగంగిరెడ్డి పిటీషన్‌పై సీబీఐ కౌంటర్‌

ABN , First Publish Date - 2022-02-19T01:49:48+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎర్రగంగిరెడ్డి వేసిన పిటీషన్‌కు సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది.

ఎర్రగంగిరెడ్డి పిటీషన్‌పై సీబీఐ కౌంటర్‌

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎర్రగంగిరెడ్డి వేసిన పిటీషన్‌కు సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. సిట్‌ బృందాలు దర్యాప్తులో సేకరించిన నివేదికలు కోర్టుకు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని ఎర్రగంగిరెడ్డి 17వ తేదీ పులివెందుల కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఇప్పటి వరకు సిట్‌ 1, సిట్‌ 2, సీబీఐ వద్ద ఉన్న డాక్యుమెంట్‌ ప్రతులు తమకు ఇవ్వాలని ఆ పిటీషన్‌లో కోరినట్లు తెలిసింది. దీనిపై శుక్రవారం సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా వివేకా హత్య కేసు వీలైనంత త్వరలో ముగించాలనే లక్ష్యంతో సీబీఐ పావులు కదుపుతోంది. నిందితులు వేసే పిటీషన్లకు బదులిస్తూ ముందుకుసాగుతోంది. 

Updated Date - 2022-02-19T01:49:48+05:30 IST