వివేకా హత్య కేసులో దేవిరెడ్డిపై సీబీఐ ఛార్జిషీటు

ABN , First Publish Date - 2022-02-04T22:23:56+05:30 IST

వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిపై

వివేకా హత్య కేసులో దేవిరెడ్డిపై సీబీఐ ఛార్జిషీటు

కడప: వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు చార్జిషీట్‌ను వేశారు. వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి 5వ నిందితుడిగా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా శివశం కర్ రెడ్డి ఉన్నాడు. గత ఏడాది నవంబరు 17న శివశంకర్ రెడ్డిని హైదరాబాద్‌లో సీబీఐ అరెస్టు చేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు గతంలోనే ఒక చార్జిషీటును దాఖలు చేశారు. మొదటి ఛార్జిషీట్లో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి పేర్లను నిందితులుగా సీబీఐ చేర్చింది. ఇప్పుడు రెండో చార్జిషీట్లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని నిందితుడిగా పేర్కొన్న సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది.

Updated Date - 2022-02-04T22:23:56+05:30 IST