గుంటూరు అర్బన్ పోలీసులపై సీబీఐ కేసు నమోదు

ABN , First Publish Date - 2020-08-12T17:19:21+05:30 IST

గుంటూరు: గుంటూరు అర్బన్ పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసింది. అక్రమ నిర్బంధం విషయమై ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

గుంటూరు అర్బన్ పోలీసులపై సీబీఐ కేసు నమోదు

గుంటూరు: గుంటూరు అర్బన్ పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసింది. అక్రమ నిర్బంధం విషయమై ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ప్రధాన కారకుడు సీఐ కళ్యాణ రాజుపై కూడా కేసు నమోదు చేయాలని న్యాయవాది మాగులూరి హరిబాబు డిమాండ్ చేశారు. పట్టాభిపురం స్టేషన్ వద్ద మహిళల పట్ల సీఐ కళ్యాణ రాజు అమానుషంగా వ్యవహరించాడన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి ఎస్పీ రామకృష్ణపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. తదుపరి విచారణ సమయంలో మిగిలిన పోలీసులు వివరాలు అందజేస్తామని న్యాయవాది మాగులూరి హరిబాబు తెలిపారు.


Updated Date - 2020-08-12T17:19:21+05:30 IST