చదలవాడ ఇన్ఫ్రా ఎండీపై సీబీఐ కేసు
ABN , First Publish Date - 2020-10-02T07:22:59+05:30 IST
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే చదలవాడ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీతో పాటు ఆ కంపెనీ ఎండీ చదలవాడ రవీంద్రబాబు పైనా సీబీఐ కేసులు నమోదు చేసింది...
న్యూఢిల్లీ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే చదలవాడ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీతో పాటు ఆ కంపెనీ ఎండీ చదలవాడ రవీంద్రబాబు పైనా సీబీఐ కేసులు నమోదు చేసింది. తమ నుంచి తీసుకున్న రుణాలను దారిమళ్లించడం, దుర్వినియోగం చేయడం ద్వారా రూ. 166.93 కోట్ల మేర నష్టం కలిగించారని ఎస్బీఐ ఫిర్యాదు చేయడంతో సీబీఐ ఈ కేసులు బుక్ చేసింది. ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం కింద ఈ కేసులు నమోదు చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలకు సంబంధించి ఈ కంపె నీ వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టు పనులు చేపట్టేది.