అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్లు
ABN , First Publish Date - 2022-03-12T03:17:32+05:30 IST
రాజధాని అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో
అమరావతి: రాజధాని అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్లు దాఖలయ్యాయి. దియా రామకృష్ణ, మన్నవ సుబ్బారావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్ట్లో కేవియట్ పిటిషన్లు దాఖలయ్యాయి. కేవియట్ పిటిషన్లను సుప్రీంకోర్టు అడ్మిట్ చేసుకున్నది. హైకోర్ట్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వొద్దని కేవియట్ పిటిషన్లలో వారు పేర్కొన్నారు. లాయర్లు యలమంచిలి శివసంతోష్, నర్రా శ్రీనివాస్ పిటిషన్లు దాఖలు చేశారు.